Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల సవాళ్లతో హీట్ ఎక్కిన రాజకీయాలు. ఇరువర్గాల మధ్య దాడులు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న నేతలు. ఇది పుట్టపర్తిలో ప్రస్తుత పరిస్థితి.
పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఈక్రమంలో శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆలయం వద్దకు పల్లె రఘునాథరెడ్డి కూడా వచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఒకరి వర్గంపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేశారు. ఇక పల్లె రఘనాథరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి వైసీపీ దైర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.