Woman: పింఛన్ కోసం ఓ మహిళ ఏం చేసిందో తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలు అంధురాలిగా నటించింది. అధికారుల కల్లుగప్పి పింఛన్ తీసుకుంది. ఇటీవల ఓ చిన్నపొరపాటు చేసి దొరికిపోయింది. ఇటలీలో జరిగింది ఈ ఘటన.
ఓ మహిళ పదిహేనేళ్ల క్రితం తాను అంధురాలిగా ఓ వైద్యుడి నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంది. దానిని చూపించి ఫింఛన్కు దరఖాస్తు చేసుకుంది. అయితే సర్టిఫికేట్ చూసి నిజమే అని నమ్మిన అధికారులు సదరు మహిళకు పింఛన్ సాంక్షన్ చేశారు. అలా 15 ఏళ్ల నుంచి మహిళ పింఛన్ పొందుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఆమె 2,08,000 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు 1.8 కోట్లు తీసుకుంది.
ఇటీవల ఆమె ఓ ఫైల్ పైన సంతకం చేస్తుండగా చూసిన అధికారులు అనుమానం వచ్చి విచారించడంతో అసలు బండారం బయటపడింది. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పింఛన్ రూపంలో ఇప్పటి వరకు ఆమెకు చెల్లించిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.