Rain: ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడుగు బయట పెట్టాలంటేనే బయపడిపోతున్నారు. సాధారణంగా కంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఎండలతో సతమతం అవుతున్న జనాలకు వాతవరణ శాఖ చల్లటి వార్త చెప్పింది.
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.