Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మినిమం 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సిందే. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే.. విమానంలో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ 8 గంటల్లోనే తిరుపతి చేరుకునేలా కేంద్రం వందేభారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్లో ఈ రైలును ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 9 నుంచి ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం మినహా ప్రతిరోజూ సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రయాణానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుంది. ఇక తాజాగా ఈ ట్రైన్ టైమింగ్స్ను అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్-తిరుపతి (20701): సికింద్రాబాద్ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.
తిరుపతి-సికింద్రాబాద్(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్ 23.45.