Ys Sharmila: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆరా తీస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బడాబాబులను తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని శర్మిల ఆరోపించారు. చిన్న వ్యక్తలను ఇరికిస్తున్నారన్నారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని.. ఇతర కారణాలు చూపించి నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడానికి తాను క్రిమినల్నా? అని ప్రశ్నించారు.
ఈక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శర్మిలతో పాటు పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.