Sajjanar: మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు.. ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించడమే వీటి పని. అమాయకపు ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలను దోచుకుంటుంటాయి. ఇటువంటి కంపెనీలు చేసిన మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీలను నమ్మొద్దంటూ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలుమార్లు హెచ్చరించారు.
గతంలో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీకి ప్రచారం చేయడంపై ఘాటుగా స్పందించారు సజ్జనార్. మరోసారి ఇటువంటి కంపెనీలకు ప్రమోషన్స్ చేయొద్దని సూచించారు. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో పలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలను క్లోజ్ చేయించారు.
ఇక ఇటీవల బాలీవుడ్ బిగ్బాస్ అమితాబ్ బచ్చన్ ఓ గొలుసుకట్టు సంస్థకు ప్రాచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. దీనిపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని అన్నారు. అమాయకపు ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలను సెలబ్రెటీలు ప్రమోట్ చేయొద్దని సూచించారు. అలాగే మద్ధతు కూడా ఇవ్వొద్దంటూ పోస్టు చేశాడు. ఆ పోస్టుకు అమితాబ్ బచ్చన్ను ట్యాగ్ చేశారు.