Rameswaram : తమిళనాడులోని రామేశ్వరం ఒక చిన్న ద్వీప పట్టణం. భారత దేశానికి దక్షిణ వైపు ఉన్న రామేశ్వరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పాదం ఇండియాలో ని ప్రసిద్ధమైన, పవిత్రమైన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. రామేశ్వరంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది. ఈ ప్రాంతంలో శ్రీరాముడు పాదాల కథ నడిచిన కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని రాములవారి ప్రాంతంగా భావిస్తారు. ఈ ప్రాంతంలోనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జన్మించారు. ఈ దేవాలయం చుట్టుపక్కల తూర్పు వైపు ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం, పడమర దిక్కున ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరానికి సంబంధించి కొన్ని ఆలయాలు ఉన్నాయి..
అయితే రామేశ్వరానికి వెళ్లాలి అనుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్లాలి. లేదంటే చాలా పాపాలు చుట్టుకుంటాయి అని కొంత మంది పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో కలిపితే అప్పుడు కాశీ యాత్ర అ పూర్తి అయినట్లుగా భావిస్తుంటారు. శ్రీరాముడు కూడా ఇక్కడి నుంచే రామసేతు నిర్మించి లంకకు చేరుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి.. అందుచేతనే ఆ కట్టడాన్ని రామసేతువు గా పిలుస్తారు.
రావణాసురుడి వధించిన తరువాత, ఆ పాపాన్ని ని తొలగించుకోవడానికి శ్రీరాముడు స్వయంగా ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మించాడట. అందుచేతనే ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగి పోతాయని చెబుతుంటారు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు.. అక్కడే ఆమె నగలు కొన్ని జారవిడిచిందట. అందుకే ఈ దేవాలయాన్ని మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెబుతుంటారు.