IPL : మార్చి 31న నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ను ఐపీఎల్ ఉర్రూతలూగించనుంది.అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 16వ సీజన్ ప్రారంభం కానుంది. 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఐపీఎల్
రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులు మజాను అందించనుంది.
తమన్నా స్పెషల్ షో..
ఐపీఎల్ ప్రారంభ వేడుకను అదిరిపోయేలా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మార్చి 31న సాయంత్ర 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకల సందడి మొదలవుతుంది. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తమన్నా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.
ఫస్ట్ ఫైట్..
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. కెప్టెన్గా తొలి సీజన్లోనే హార్థిక్ పాండ్యా గుజరాత్ జట్టుకు టైటిల్ ను అందించాడు. తనలో నాయకత్వ లక్షణాలున్నాయని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ అందుబాటులో లేని సమయంలో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తొలి వన్డేకు హార్థిక్ పాండ్యానే కెప్టెన్ వ్యహరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది. మరోవైపు మూడేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. మహి సారధ్యంలోని చెన్నై జట్టుపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జరుగుతోంది.
ముంబై టాప్..
ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టు ముంబై. ఆ జట్టు 5 సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. చెన్నై నాలుగుసార్లు విజేతగా నిలిచింది. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఇంత వరకు ఒక్క టైటిల్ ను కూడా గెలవలేదు. మరి సారైనా ఐపీఎల్ కొత్త విజేతను చూస్తామా..?