Moon:- ఎక్కువశాతం శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి, దానిపైకి శాటిలైట్లను, మనుషులను పంపించడానికి ఇష్టపడతారు. చంద్రుడిపై చేసిన పరిశోధనలకు ఎక్కువ సక్సెస్ రేటు ఉండడం కూడా దీనికి ఒక కారణం. అలా ఎన్నో దేశాలు చేసిన కొన్ని వేల పరిశోధనల్లో చంద్రుడి గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. తాజాగా మరో విషయం శాస్త్రవేత్తలకు ఆసక్తిని పెంచింది. అదే చంద్రుడిపై నీటిజాడ.
ఏ గ్రహంలో అయినా మనిషి జీవనం కొనసాగాలంటే అక్కడ నీరు ఉండాలి. అందుకే ఈ కోణంలో ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రుడిపై కూడా నీటిజాడ కనిపించడం శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచేస్తోంది. చంద్రుడిపై అక్కడక్కడ పూసలలాగా నీరును వారు కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే చంద్రుడిపై రిజర్వాయర్ ఏర్పాటు చేయడం సులభమే అని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది భవిష్యత్తులో ల్యూనార్ నేలపై ఎన్నో పరిశోధనలకు ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.
చంద్రుడిపై నేల అనేది ఎప్పుడూ ఎండిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా చంద్రుడిపై నీటిజాడ ఉందని తెలిసేలా పలు పరిశోధనలు జరిగాయి. 2020లో చైనా చేసిన రోబోటిక్ చేంజ్ ఈ5 మిషిన్ సమయంలో ట్యూనార్ నేలపై నుండి కొంత మట్టిని శాస్త్రవేత్తలు సేకరించారు. అప్పటినుండి ఈ మట్టిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చంద్రుడి నేలపై సోలార్ విండ్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
చంద్రుడి చుట్టూ ఎప్పుడో ఒక సోలార్ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అవన్నీ దానిపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ నేలపై పూసలులాగా నీళ్లు ఫార్మ్ అవ్వడానికి కూడా ఇలాంటి ఒక ఈవెంట్ కారణమయ్యి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనల సంఖ్య ఎక్కువయ్యింది. భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే అక్కడ నీరు అనేది ఉంటే.. తాగడానికి మాత్రమే కాకుండా ఫ్యూయల్గా కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మూడ్ను మెరుగుపరిచే ఐఫోన్ 14 ప్లస్..
for more updates follow this link:-Bigtv