News: కాశీలో, హిమాలయాల్లో కనిపించే అఘోరాలు నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఓ టీడీపీ ముస్లిం నాయకుడి ఇంట్లో కనిపించారు. ఆయన్ను ఆశీర్వదించారు. రక్ష కూడా కట్టారు.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ ఇంట్లో అఘోరాలు కనిపించడం నంద్యాలలో హాట్ టాపిక్గా మారింది. ఆయనే పిలిచారా.. వాళ్లే వచ్చారా.. అనేది చర్చగా మారింది. తన ఇంటికి అఘోరాలు అనుకోని అతిథుల్లా వచ్చారని ఫరూక్ చెప్తున్నారు. ఇంట్లో కాసేపు ఆశీనులైన అఘోరాలు.. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావంటూ ఆశీర్వదించారు.
ఇంతలో కొందరు ఫరూక్ అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. అఘోరాలకు మొక్కారు. ఆశీర్వాదం తీసుకున్నారు.
సాధారణంగా హిందువుల ఇళ్లకు అఘోరాలు వెళ్తారని, ముస్లిం నాయకుని ఇంటికి వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పిలిస్తే గాని రాని అఘోరాలు.. ఫరూక్ ఇంటికి అనుకోకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అఘోరా ఆశీర్వాదం అందుకున్న టీడీపీ స్థానిక నాయకులు మస్త్ హ్యాపీగా ఉన్నారు.