America: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెైద్యులు వెల్లడించారు.
అయితే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదని.. తెలిసిన వ్యక్తుల మధ్యే జరిగాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. బాధితులు నిందితులు ఒకరికొకరు తెలిసిన వారేనని అన్నారు. కాల్పులకు ముందు వారి మధ్య గొడవ జరిగిందని.. ఆ తర్వాత ఓ వ్యక్తి గన్ తీసి కాల్పులు జరిపాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.