Puja:- కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు. పూజల విషయంలో ఎంతో మంది సమయ పాలన పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ, పూజలు చేస్తూ ఉంటారు. తిరుపతితో పాటు ప్రముఖ దైవ క్షేత్రాల్లో సమయ పాలనతో పూజలు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. ఉదయం ఈ సేవ, రాత్రి ఈ సేవ అన్నట్లుగా పూజలు ఉంటాయి.అలాంటి పెద్ద దైవ క్షేత్రాల్లోనే సమయంకు పూజలు నిర్వహిస్తారు. . చిన్న పూజలైనా కూడా సమయం పాటించాలని హిందూ ధర్మ ప్రచారకులు చెబుతున్నారు.
ఉదయాన్నే చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాలు రోజులోని ఇతర భాగాల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. ఇష్టం వచ్చిన వేళల్లో పూజ చేయడం చాలా పెద్ద తప్పు అనేది హిందూ ధర్మ గురువులు చెబుతున్నారు. ఇంట్లో పూజ అయినా కూడా కాస్త అటు ఇటు అయితే పర్వాలేదు కాని మరీ మిట్ట మద్యాహ్నం చేయడం ఏమాత్రం సబబు కాదు. ప్రత్యేకపూజల సంగతి ఎలా ఉన్నా ప్రతి వారం లేదా ప్రతి రోజు చేసుకునే సేవలు మరియు దైవ ప్రార్థనలు ఉదయం పది గంటల లోపు పూర్తి చేస్తే ఉత్తమం. కాస్త ఆలస్యం అయితే 11 గంటల వరకు పర్వాలేదు.కాని మిట్ట మద్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు
రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్దతి కాదట. కారణం రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమంటున్నారు. అందుకే తెల్లవారు జామున చేసే పూజలతోనే సత్ఫలితాలు వస్తాయంట. ఎంత పూజైనా ఉదయం 8 గంటల వరకు చేసుకుంటే మంచిది. ఇంట్లో పనులు, అవి ఇవి ఉన్న వారు కాస్త ఆలస్యం అయితే ఏమో కాని మరీ మిట్ట మధ్యాహ్నం పూజ పెట్టుకోవద్దు. పూజ చేసినప్పుడు చిన్న తప్పు చేసినా ఫలితం దక్కని పెద్దలు చెబుతున్నారు.
భదాద్రికి పుణ్యతీర్ధ జలాలు ఎందుకంటే….
for more updates follow this link:-bigtv