Nikhat Zareen: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి చరిత్ర సృష్టించింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో గెలుపొందింది. రెండు సార్లు ఆసియా కప్ విజేత అయిన వియత్నాం బాక్సర్ గుయెన్ థి టాయ్ను ఫైనల్లో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. 5-0 తేడాతో గుయెన్ను ఓడించింది. 50 కిలోల విభాగంలో భారత్కు స్వర్ణం తెచ్చిపెట్టింది. భారత్ ఖాతాలోకి ఇప్పుడు మూడు బంగారు పతకాలు వచ్చి చేరాయి.
దీంతో కలిపి ప్రపంచ చాంపియన్ షిప్లో నిఖత్ రెండు బంగారు పతకాలను సాధించింది. ఇప్పటి వరకు భారత్ నుంచి మేరీ కామ్ మాత్రమే వరల్డ్ చాంపియన్ షిప్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. తాజా విజయంతో నిఖత్ జరీన్ కూడా రెండు మెడల్స్ సాధించిన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.