Malli Pelli: నటుడు నరేష్, పవిత్ర లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్టాపిక్ వీరిద్దరు. కొద్దిరోజులుగా వీరిపై వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇటీవల ఓ వీడియోతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు నరేష్. పవిత్రను పెళ్లిచేసుకున్నట్లు తెలియజేస్తూ వారి పెళ్లికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది.
ప్రస్తుతం వారిద్దరు కలిసి లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ ఎంఎస్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘మళ్లీ పెళ్లీ’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా ఫస్ట్ లుక్, సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేశారు. వీడియోలో పవిత్ర నరేష్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇంటి ముందు ముగ్గేస్తుంటే.. నరేష్ చిరునవ్వు నవ్వుతూ ఆమె ముందు కూర్చొని ముగ్గు ఎలా వేస్తుందో చూస్తుండడం మనం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అయితే ఇటీవల వైరలయిన వారి పెళ్లికి సంబంధించిన వీడియో ఈ మూవీలోదేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రమోషన్స్లో భాగంగానే నరేష్ ఆ వీడియోను షేర్ చేశారని చర్చించుకుంటున్నారు. అందరినీ నరేష్ ఫూల్ చేశాడని మాట్లాడుకుంటున్నారు.