Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెకన్ మొత్తం సీఎం కేసీఆర్ కుటుంబమే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిట్ నోటీసులు అందుకున్న ఆయన విచారణకు హాజరైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్ నోటీసులు జారీ చేస్తోందని.. అలాగే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయని.. ఇదే విషయాన్ని సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్కు చెప్పానన్నారు రేవంత్. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్ నుంచి సిట్ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్ విచారణకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.