Patna: మునుషుల్లో క్రూరత్వం రోజురోజుకు పెరిగిపోతోంది. కొందరు విచక్షణ కోల్పోయి జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసులను మించిపోతున్నారు. మనుషులకు జంతువులకు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. మహిళలకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన బీహార్లోని పాట్నాలో చోటుచేసుకుంది.
ఫూల్వారీ షరీఫ్లోని ఫైసల్ కాలనీలో ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మార్చి 8న హోలీ పండుగ రోజున జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందరూ హోలీ ఆడుతూ సంబురాలు చేసుకుంటుంటే ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ బయటకు రావడంతో స్థానిక ఎన్జీవో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మేరకు జంతు చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మనీష్ కుమార్ వెల్లడించారు.