Tamilanadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ. వెయ్యి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘‘మగళిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెళ్లడించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మహిళలు ఈ పథకంతో ఊరట చెందుతారని అన్నారు. ఈక్రమంలో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో రూ. 7 వేల కోట్లను కేటాయించారు. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తహిళ సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.