Ugadi:హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని ప్రతిపద తిథి నుండి ప్రారంభమవుతుంది. చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈసారి ఉగాది మార్చి 22నజరుపుకోనున్నారు.ఉగాదితోనే తెలుగు వాళ్లకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజు నుంచే కొత్త పంచాంగం కొత్త సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు. ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటకలలో జరుపుకుంటారు. అదే రోజును మహారాష్ట్రలో గుడి పడ్వాగా జరుపుకుంటారు. అంతేకాకుండా, ఇది ఉత్తర భారత రాష్ట్రాల్లో సాధారణంగా జరుపుకునే చైత్ర నవరాత్రుల ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. సాధారణంగా ఉగాది, దీపావళి పండుగల సమయంలో అభ్యంగన్న సానం చేస్తారు. నూనె స్నానం చేయడం హిందూ మతంలో ఉంది. దీంతో లక్ష్మీ, గంగాదేవిల అనుగ్రహం పొందవచ్చు.
ఉగాది రోజు చేసేశరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగిస్తుంది.ఉగాది పండుగ నాడు ప్రత్యేకంగా నూనెతో స్నానం చేస్తాం. చర్మానికి నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల వ్యక్తిలో ఆధ్యాత్మిక స్పృహ ఏర్పడుతుంది. అలాగే నూనెతో స్నానం చేయడం వల్ల తేజస్సు పెరుగుతుంది. ప్రతికూలతను తొలగిస్తుంది: అభ్యంగన స్నానం వ్యక్తి శరీరం నుండి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది . సానుకూల అనుభూతిని సృష్టిస్తుంది..
నూనె రాసుకున్న చర్మంపై వేడి నీటిలో స్నానం చేయడంతో శరీరంపై రక్షణ పొర ఏర్పడుతుంది. దైవిక ప్రవాహం పుడుతుంది. నూనె స్నానం సమయంలో, దైవిక సూత్రం ప్రవాహం శరీరంలో ఆకర్షించబడుతుంది . శరీరంలో తరంగాలు ఉత్పన్నమవుతాయి. జీవశక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో జీవశక్తి పెరుగుతుంది. దీనివల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఆనందంగా ఉంటాడు.ఉగాది రోజు ఉగాది పచ్చడిని కచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఆరు రుచుల పదార్థాలు ఉండేలా కొత్త కుండలో పచ్చడిని ఉంచి దాన్ని పంచాంగ పూజ అనంతరం నైవేద్యంగా పెట్టి.. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు ఉగాది పచ్చడిని తీసుకోవాలి.