Keerthy Suresh: ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ‘మహానటి’ సినిమాలో అచ్చం సావిత్రిలా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది.
ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ‘దసరా’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఎలాగైనా ‘దసరా’ సినిమాతో హిట్ సాధించాలని కీర్తి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉంది.
ఇకపోతే కీర్తి సురేష్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘దసరా’ మూవీ షూటింగ్ పూర్తియిన సందర్భంగా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ కీర్తి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందట. 130 మంది టెక్నీషియన్స్కు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చిందట. అయితే ఈ విషయాన్ని కీర్తి అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ వార్త నిజమా.. కాదా.. తెలియాలంటే కీర్తి సురేష్ స్పందించాల్సిందే.