Ponnambalam: తెలుగు, తమిళ చిత్రాలతో పాటు పలు దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో విలన్గా మెప్పించిన నటుడు పొన్నాంబలం. ఒకప్పుడు ఫేమస్గా ప్రతినాయకుడిగా స్టార్ హీరోల సినిమాల్లో నటించారీయన. కొన్ని కారణాలతో సినిమా రంగానికి దూరమైన ఆయన బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది. సాయం చేయాలని ఆయన కోరారు. దీంతో పలువురు తమిళ స్టార్స్ ఆయనకు తమ వంతుగా సాయాన్ని అందిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆయన మనసుని దోచేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.45 లక్షలు సాయాన్ని అందించారు.
ఈ విషయాన్ని పొన్నాంబలం ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిడ్నీలు పాడయ్యాయి. చాలా మంది నటీనటులు నాకు సాయం చేశారు. అదే సమయంలో చిరంజీవిగారి సాయం చేస్తారేమోననిపించింది. నా స్నేహితుడి ద్వారా నెంబర్ సంపాదించాను. అన్నయ్య నేను పొన్నాంబలం నా కిడ్నీలు పాడయ్యాయి. ఏమైనా సాయం చేయగలరా? అని రిక్వెస్ట్ చేశాను. ఆయనేమైనా ఒకట్రెండు లక్షలు ఇస్తే కిడ్నీ డయాలిసిస్ చేయించుకోవాలనేదే ఆలోచనగా ఉండింది. మెసేజ్ పెట్టిన పది నిమిషాల్లో చిరంజీవిగారు ఫోన్ చేసి ఏం పొన్నాంబలం ఎలా ఉన్నావని అడిగారు. ఇలా కిడ్నీలు పాడయ్యాయని చెప్పగానే హైదరాబాద్కు వస్తావా? అని అన్నారు. నేను రాలేను అన్నయ్యా.. అని చెప్పాను.
వెంటనే ఆయన మరో ఐదు నిమిషాల్లో ఫోన్ చేశారు. ఒక గంటలో నువ్వు రిపోర్ట్స్ తీసుకుని చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వెళ్లు.. అన్నారు. నేను వెళ్లగానే గేటు దగ్గర తీసుకునే రెండు వందల రూపాయల డబ్బులు కూడా తీసుకోలేదు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు అయ్యాయి. అదంతా ఆయనే చూసుకున్నారు. దేవుడిలా సాయం చేశారు. రామ్ చరణ్ సార్గారి బార్య ఉపాసనగారు ఆ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్లో ఒకరు. ఆమె స్వయంగా నన్ను పరామర్శించారు’’ అంటూ పొన్నాంబలం ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మెగా ఫ్యాన్స్ చిరంజీవి మనసు చాలా మంచిదని, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని ప్రశంసిస్తున్నారు.
రాజమౌళికి మోదీ, స్పీల్ బర్గ్ ఒకటే చెప్పారు
for more updates follow this link:-bigtv