Chiranjeevi:జూబ్లీ హిల్స్ హౌసింగ సోసైటీ వివాదంలో తెలంగాణ హైకోర్టు సినీ హీరో చిరంజీవికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఏంటనే వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ గతంలో 595 గజాల స్థలాన్ని చిరంజీవికి కేటాయించటంపై జె.శ్రీకాంత్ బాబు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే ఈ స్థలం ప్రజా అవసరాల కోసమే వినియోగింటానికి కేటాయించారు. అయితే దానికి విరుద్ధంగా చిరంజీవికి స్థలం కేటాయించటం పైనే వివాదం నెలకొంది. జీహెచ్ఎంసీ కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోవటంతో సోసైటీని నిబంధనలను పాటించకుండా చిరంజీవికి స్థలాన్ని కేటాయించరాని, అందులో చిరంజీవి నిర్మాణాలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు.
కేసు విచారించిన హైకోర్లు చిరంజీవి వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పటమే కాకుండా కౌంటర్ దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషన్, జూబ్లీ హిల్స్ హౌసింగ్ సోసైటీకి ఆదేశాలను జారీ చేసింది. కేసుని ఏప్రిల్ 25కి వాయిదా వేసింది కోర్టు. మరిప్పుడు చిరంజీవి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాను చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది. తదుపరి చిత్రాన్ని ఆయన కోలీవుడ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం. దీనికి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. బి.వి.ఎస్.రవి ఈ మూవీకి కథను అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ సాధించిన సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు.
Dil Raju: దిల్ ‘రాజు’ రాజకీయ ‘బంటు’నా?.. ఆ హడావుడి అందుకేనా?
NTR : RRRకు ఆస్కార్ అవార్డు.. ఆమెకే తొలి ఫోన్ కాల్.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..