Erukumamba Temple : విశాఖ జిల్లాలో దొండపర్తి ఎరుకమాంబ అమ్మవారికి తల లేకుండా పూజలందుకుంటోంది. ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఎరుకుమాంబ అమ్మవారును వ్యవహరిస్తారు. బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తీరుతాయని విశ్వాసం. భక్తులు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదున్నర వరకు స్నానఘట్టాలను ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు, వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలు కల్యాణ యోగం పొందుతారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే, ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఎరుకుమాంబ అమ్మవారును పూజిస్తారు.
ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహాన్ని విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే, ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరు పడిన అమ్మవారి శిరస్సు అతికించిన నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా.. శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖ వాసులు.
ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి, ఎరుకుమాంబ అమ్మవారు ఆలయానికి ఎవరు వచ్చినా, వారి స్వంత మార్గంలో ఎరుకుమాంబ అమ్మవారును పూజించవచ్చని ధర్మకర్తలు నియమం పెట్టారు. విశాఖపట్నం నగరంలో దొండపర్తి ప్రాంతంలో ఈ ఆలయం కలదు.
ప్రతీ ఏటా అక్టోబర్ మాసంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.