Indigo: విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు అస్వస్థతకు గురవ్వడం.. వెంటనే ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా ఢిల్లీ నుంచి ఖతార్ వెళ్తున్న ఇండిగో విమానంలో కూడా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని పాకిస్థాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఖతార్లోని దోహాకు ఇండిగో విమానం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది పైలట్కు సమాచారం అందించారు. దీంతో పైలట్ ఫ్లైట్ దారి మళ్లించి పాకిస్థాన్లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
వెంటనే ఎయిర్పోర్ట్ మెడికల్ సిబ్బంది అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని పరీక్షించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్దారణ వచ్చారు. మృతుడు నైజీరియాకు చెందిన అబ్ధుల్లా(60)గా అధికారులు గుర్తించారు. ఇక మృతదేహంతో విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఇతర ప్రయాణికులను తిరిగి దోహా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అబ్దుల్లా మృతిపట్ల ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.