Rajamouli: ఆస్కార్ వేదికపై నాటునాటు సాంగ్ రచ్చ చేసింది. ఆ సాంగ్తో డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. రాహుల్ సిప్లిగంజ్, భైరవ వేదికపై నాటునాటు సాంగ్ పాడుతుండగా.. థియేటర్లో కూర్చున్న వాళ్లంతా లేసి స్టెప్పులేశారు. కేరింతలు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలుగోడి సత్తా రుజువైంది.
ఇక నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే.. థియేటర్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. డైరెక్టర్ రాజమౌళి ఎగిరిగంతేశారు. తన భార్యను ఆలింగనం చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి తెలుగు సినిమా సాంగ్ ఆస్కార్ను దక్కించుకోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ లవర్స్ పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.