EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu Naidu: బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ.. వైసీపీ రియాక్షన్ ఇదే..

Chandrababu Naidu: బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ.. వైసీపీ రియాక్షన్ ఇదే..

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని దొంగ ఓట్లు నమోదయయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. డిగ్రీ చదవని వాళ్లు కూడా నకిలీ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. పలు చోట్ల అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై బోగస్ ఓట్లను సృష్టించారని ఆరోపించారు.


ఈమేరకు బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు. తిరుపతిలో 44వ డివిజన్‌లో చికెన్ షాపు అడ్రస్‌తో కూడా 16 ఓట్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫేక్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందన్నారు. తప్పుడు అడ్రస్‌లతో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని తెలిపారు. బోగస్ ఓట్లు నమోదులో బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా సీఈసీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇక చంద్రబాబు దొంగ ఓట్లపై సీఈసీకి లేఖ రాయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి టీడీపీ నేతలు సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని బోగస్ ఓట్లను చేర్చిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.


Tags

Related News

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

Big Stories

×