YS Bhaskar Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని గతేడాది సీబీఐ రెండు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసుల పంపించింది. ఈమేరకు భాస్కర్ రెడ్డి విచారణ నిమిత్తం ఆదివారం కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైలులోని గెస్ట్హౌస్లో విచారణ జరగాల్సి ఉండగా.. అక్కడ సీబీఐ అధికారులు ఎవరూ లేకపోవడంతో భాస్కర్రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
ఇక భాస్కర్ రెడ్డి రాకతో కడప సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు భాస్కర్రెడ్డి వెల్లడించారు. అలాగే హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదు? అని ప్రశ్నించారు. తనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానని భాస్కర్రెడ్డి వెల్లడించారు.