Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం ఐదుగురు సభ్యుల ఈడీ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అయిపోగానే కవిత ఈడీ ఆఫీస్ నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత అర్థరాత్రి కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్గౌడ్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయల్దేరి వచ్చారు. 12.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై ఈడీ విచారణ జరిగిన తీరును వివరించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు అనే వివరాలను కేసీఆర్కు తెలిపారు.
మరోవైపు ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. తొలిసారి జరిగిన ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండోసారి జరగబోయే విచారణలో కవితను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.