EPAPER

Crime: భర్తను హత్య చేసిన భార్య.. ఐదురోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. చివరికి..

Crime: భర్తను హత్య చేసిన భార్య.. ఐదురోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. చివరికి..

Crime: భర్తను హత్య చేసి ఐదు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది ఓ మహిళ. చుట్టుపక్కల వాళ్లకు ఎటువంటి అనుమానం రాకుండా మ్యానేజ్ చేసింది. అయితే దుర్వాసన రావడంతో గుట్టురట్టయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో చోటుచేసుకుంది.


వ్యాపారస్థుడు అమర్‌నాథ్ సింగ్ తన భార్య మీరాతో కలిసి సుభాష్ నగర్‌లో నివసిస్తున్నాడు. అయితే మీరా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలవుతుండేవి. ఈక్రమంలో ఒకరోజు వారిద్దరి మధ్య వివాదం చోటుచేసుకొని అదికాస్త పెద్దదిగా మారింది. దీంతో కోపంతో రగిలిపోయిన మీరా తన భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది.

అయితే ఐదు రోజుల నుంచి అమర్‌నాథ్ సింగ్ కనిపించకుండా పోవడం.. అదే సమయంలో వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


దీంతో అమర్‌నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మీరాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×