Chiranjeevi:ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ మూవీని పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో విడుదలవుతుందనే టాక్ అయితే వినిపిస్తోంది. కాగా.. చిరు నెక్ట్స్ మూవీ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్న వార్తల మేరకు.. చిరంజీవి తన నెక్ట్స్ మూవీని ఓ తమిళ దర్శకుడితో చేయబోతున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పి.ఎస్.మిత్రన్. ఈయన ఇంతకు ముందు విశాల్తో అభిమన్యుడు, హీరో, సర్దార్ చిత్రాలను తెరకెక్కించారు. అన్నీ సినిమాలు సక్సెస్ అయినవే.
ఇప్పుడు మిత్రన్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయటానికి రెడీ అయిపోయారు. అది కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కావటం విశేషం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు కథను మన తెలుగు రైటర్ బి.వి.ఎస్.రవి అందిస్తున్నారు. సినిమాను నిర్మించబోయేదెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత. కొన్ని రోజుల నుంచి పెద్ద కుమార్తె బ్యానర్లో చిరంజీవి సినిమా చేస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ సినిమా కన్ఫర్మ్ అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సినీ సర్కిల్స్ టాక్.
PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్