NTR: అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం రచ్చ చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకలకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్లు అభిమానులతో సమావేశమవుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతర్జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ‘‘ ఆస్కార్ వేడుకల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్పై నడిచేది.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అని అనుకోవడం లేదు. అక్కడ నడిచేటప్పుడు మేము భారతదేశాన్ని మా హృదయాల్లో మోయనున్నాము. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. ఇక వేదికపై నాటు నాటు సాంగ్కు డ్యాన్స్ వేస్తామని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. రిహార్సల్స్ చేసేందుకు మాకు టైమ్ దొరకడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.