Nagababu Tammareddy:మెగా బ్రదర్స్లో నాగబాబు ఎంత కూల్గా ఉంటారో అంతే ఫైర్ చూపిస్తుంటారు. తమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అంతేలా రిటార్ట్ ఇచ్చేస్తుంటారాయన. తాజాగా మరోసారి నాగబాబు తమ్మారెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ తమ్మారెడ్డిపై నాగబాబు ఎందుకు ఫైర్ అయ్యారు? చిరంజీవికి ఎంతో సన్నిహితంగా ఉండే తమ్మారెడ్డి, నాగబాబు నొచ్చుకునేంతంగా ఏం మాట్లాడారనే వివరాల్లోకి వెళితే,
ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి RRR గురించి మాట్లాడుతూ ఆ సినిమా ఆస్కార్కు నామినేట్ కావటానికి రూ.80 కోట్లను ప్రమోషన్స్కు ఖర్చు పెట్టారని, అదే డబ్బని మనకు ఇస్తే 8 నుంచ 10 సినిమాలు తీసి మొఖాన కొడతామని అన్నారు. ఓ తెలుగు సినిమాగా RRR అంతర్జాతీయ స్థాయి వేదికపై నిలవటం మనందరికీ గర్వకారణం. ప్రపంచంలో అందరూ మన సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటే మనవాళ్లు కొందరు మాత్రం ఇలాంటి దొప్పిపొడుపు మాటలు మాట్లాడుతున్నారంటూ తమ్మారెడ్డిపై చాలా మంది ఫైర్ అయ్యారు.
ఇప్పుడదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయ్యారు. అసలు రూ.80 కోట్లు నీ యమ్మా మొగుడు ఖర్చు పెట్టాడారా అంటూ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఇలాంటి మాటలు వైసీపీ పార్టీ నాయకులు భాషలో అంటూ చివరలో చురకలు అంటించారు. మరిప్పుడు నాగబాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Jr Ntr: తాత సాంగ్ని మరోసారి రీమిక్స్ చేస్తున్న ఎన్టీఆర్
Janhvi Kapoor: ‘NTR 30’లో జాన్వీ కపూర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?