Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్లపై కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొంతకాలంగా వారిద్దరి మధ్య దూరం పెరిగిందని.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు ఈ వార్తలకు తోడు మరో వార్త పుట్టుకొచ్చింది.
ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ జరిగింది. అలాగే అదేరోజు సాయంత్రం సానియా ఓ స్టార్ హోటల్లో పార్టీ కూడా ఇచ్చింది. ఈకార్యక్రమానికి క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఘనంగా జరిగింది పార్టీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే ఆ ఫొటోల్లో ఎక్కడా కూడా సానియా భర్త షోయబ్ కనిపించలేదు. అసలు అతడు ఆపార్టీకే హాజరు కాలేదు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని.. అందుకే షోయబ్ పార్టీకి, మ్యాచ్కు హాజరుకాలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.