Samantha:విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎట్టకేలకు హమ్మయ్య అనుకున్నారు. ఎందుకో తెలుసా! వాళ్ల అభిమాన హీరో సినిమా ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అందుకు కారణం ఈ సినిమా సెట్స్లోకి సమంత ఎంట్రీ ఇచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఖుషి’. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఖుషి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే సమంత మియో సటిస్ బారిన పడటంతో షూటింగ్ను వాయిదా వేశారు. ఆమె మియో సైటిస్ నుంచి కోలుకోవటానికి చాలా సమయమే పట్టింది. కోలుకోగానే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిపోయింది. దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సామ్కు కోపం తెచ్చుకున్నారు.
అయితే సామ్ వీలైనంత త్వరగా ఖుషి సినిమాలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పేసి వాళ్లని కూల్ చేసేసింది. అన్నట్లుగానే బుధవారం (మార్చి 8) మహిళా దినోత్సవం రోజున ‘ఖుషి’ సెట్స్లోకి అడుగు పెట్టేసింది. సామ్ రాకపై మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ను కూడా కట్ చేసి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తోన్న చిత్రమే ‘ఖుషి’. దీనిపై ఆయన ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఈ ‘ఖుషి’ మూవీ తర్వాత రౌడీ స్టార్ రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండనుంది. అలాగే మరో సినిమాను పరశురామ్ డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా సామ్ నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్కి సిద్ధమవుతోంది.
Kriti Sanon : పెళ్లి గురించి కృతి సనన్కి ప్రభాస్ ఫోన్
Anushka Shetty: హాట్ లుక్లో అనుష్క… రూమర్స్కి చెక్ పెట్టే ప్రయత్నం