UP: మర్డర్లు చేయడం.. ముక్కలుగా నరకడం.. శరీరభాగాలను వేరువేరుగా పడేయడం. ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. చికెన్ కట్ చేసినంత ఈజీగా.. మనుషులను హత్యచేసి ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఢిల్లీ శ్రద్ధావాకర్ ఘటన నుంచి హైదరాబాద్లో నవీన్ హత్య వరకు అన్నీ ఇలానే జరిగాయి. ఇటీవల ఛత్తీస్గఢ్లో కూడా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ముక్కులుముక్కలుగా నరికాడు. అనంతరం ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో బాడీపార్ట్స్ను దాచి పెట్టాడు. రెండు నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తఖాత్పుర్కు చెందిన పవన్ ఠాకూర్ అనే వ్యక్తికి సీసీటీవీ ఫిట్టింట్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో భార్యపై పవన్కు అనుమానం కలిగింది. ఆమె ప్రవర్తన బాగోలేకపోవడంతో మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఆమె వినకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈక్రమంలో రెండు నెలల క్రితం తన కొడుకులను బంధువుల ఇంటికి పంపించాడు. అనంతరం భార్యను హత్య చేసి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని మూటకట్టి ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్లో దాచిపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లకి, బంధువులకి అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.
ఇంతలో అతను చేసిన పనే పోలీసులకు దొరికిపోయేలా చేసింది. దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో పోలీసులు పవన్ ఇంటిలో తనిఖీ చేయగా.. వాటర్ ట్యాంక్లో మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీంతో పవన్ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటకొచ్చింది. ఈ మేరకు పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.