Ranga Maarthaanda: సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ జంటగా డైనమిక్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండ. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ‘పువ్వై విరిసే ప్రాణం’, ‘కళనే కొలిచే నువ్వు.. కలవే అయిపోయావు’ అనే రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘నీకు తెలిసే సత్యం’ అనే సాంగ్ లిరికల్ వీడియోను సోమవారం సాయంత్రం 4 గంటలకు.. ‘ముగిసిందా నీ అజ్ఞాతవాసం’ అనే సాంగ్ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.
ఇక ఈ సినిమాను మరాఠి చిత్రం నట సామ్రాట్కు రీమేక్గా రూపొందిస్తున్నారు. ఒక నటుడి జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు మరియు ఇతర విషయాల గురించి సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.