Amitabh Bachchan: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూమీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో జరగుతోంది.
ఇదిలా ఉండగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్కు గాయాలయ్యాయి. అతని పక్కటెముకలకు దెబ్బతగిలింది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని అబితాబ్ తన బ్లాగ్ వేదికగా తెలియజేశారు.
‘‘హైదరాబాద్లో ప్రాజెక్ట్ కె షూటింగ్ జరగుతుండగా నా పక్కటెముకలకు దెబ్బ తగిలింది. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. వైద్యులు కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అందువల్ల షూటింగ్ వాయిదా వేసుకొని ముంబై వచ్చేశాను. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను’’ అని అబితాబ్ బచ్చన్ తెలిపారు.
ఇక మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ 12 జనవరి 2024న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.