Warangal : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోవైపు హత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. తాజాగా వరంగల్లో మహిళా కానిస్టేబుల్ మౌనిక ఇలానే మృతిచెందారు. వేణురావు కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆమె మహబూబాబాద్ పోలీస్స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నారు. మృదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
కానిస్టేబుల్ మౌనిక మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త, అత్తమామలు తమ కుమార్తెను వేధింపులకు గురి చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తే ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు. మౌనిక మృతదేహంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.
మహిళా కానిస్టేబుల్ మౌనిక అనుమానాస్పద మృతిపై మట్టవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భిన్న కోణాల్లో ఈ కేసును దర్యాప్తును పోలీసులు చేపట్టారు.