Manchu Manoj: మొత్తానికి సోషల్ మీడియాలో జరిగిన చర్చే నిజమైంది. మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఒక్కటికాబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లూ.. వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా మనోజే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు కాబోయే భార్య ఫొటో షేర్ చేస్తూ.. పెళ్లి కూతురు భూమా మౌనికారెడ్డి అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక ఇప్పటికే ప్రీవెడ్డింగ్, సంగీత్ వంటి ఈవెంట్లు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వారి పెళ్లి జరగనుంది. ఫిలింనగర్లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరగనుంది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరలవుతోంది. నెటిజన్లు దాని గురించే చర్చించుకుంటున్నారు. అందేంటంటే.. గతంలో మౌనిక రెడ్డి వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులకు వారి మధ్య మనస్పర్థాలు రావడంతో విడిపోయారు. అయితే వారి పెళ్లికి మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అప్పుడు ఆమె పెళ్లికి హాజరై.. ఇప్పడు ఆమెనే పెళ్లి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.