Bill Gates: టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల భారతీయ వంటకం రోటీని తయారు చేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్తో కలిసి రోటీ చేసి వంటలో తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఇక తాజాగా మరోసారి చెఫ్గా మారారు బిల్ గేట్స్.
భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ పోషణతో సాధికారత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి తృణధాన్యాలతో కిచిడీ తయారు చేశారు. దాని రుచి చూడడంతో పాటు అక్కడున్న కొంతమంది చిన్నపిల్లలకు స్వయంగా తినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను స్మృతి ఇరానీ ట్విట్టర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
ఇక గతంలో బెర్నాత్తో కలిసి రోటీ చేసిన వీడియోను ప్రధాని మోదీ చూసి బిల్ గేట్స్పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం భారత్లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోందని.. వాటితో ఎన్నో వంటకాలు చేయొచ్చని.. ఓసారి వాటిని కూడా ట్రై చేయండి అని కామెంట్ చేశారు.