Upasana: మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న పోయిన ఏడాది డిసెంబర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాసన డెలివరీ ఎక్కడ అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డెలివరీ కోసం ఉపాసన అమెరికాకు వెళ్లనుంది అని కొద్దిరోజులుగా సోషల్ మీడియా కోడైకూస్తుంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఉపాసన.
ఇటీవల రామ్చరణ్ అమెరికాకు వెళ్లినప్పుడు గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్తో చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఉపాసన అమెరికా వస్తుంది. మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది’’ అని అన్నారు. దీంతో ఉపాసన డెలిరీ అమెరికాలోనే అని వార్తలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరిగింది.
తాజాగా ఉపాసన చేసిన ట్వీట్తో ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ‘‘డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీరు మా అపోలో ఆసుపత్రి ఫ్యామిలీలో భాగమవ్వండి. డాక్టర్లు సుమన మనోహర్, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.