CRED: దిగ్గజ కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(సీఈవో) అంటే.. కోట్లల్లో జీతం.. లగ్జరీ లైఫ్.. చేతి కింద వందల మంది ఉద్యోగులు.. ఏది కావాలంటే అది క్షణాల్లో వచ్చి చేరుతుంది. అయితే ఈ సీఈవో మాత్రం అందరు సీఈవోల లెక్క కాదు. సామాన్య ఉద్యోగిలానే తక్కువ జీతం తీసుకుంటాడు. అందరితో కలిసి పని చేస్తాడు.
అతడే ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా. ఆయన కేవలం నెలకు రూ.15 వేల జీతం మాత్రమే తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కునాల్ షానే వెల్లడించాడు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీతింగ్ సెషన్ నిర్వహించాడు. ఈ సెషన్లో తన జీతం గురించి చెప్పి నెటిజన్లను షాక్కు గురిచేశాడు.
దీంతో ఓ నెటిజన్ ‘‘అంత తక్కువ జీతంతో మీరు ఎలా జీవిస్తున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘క్రెడ్ సంస్థ లాభాల్లోకి వచ్చే వరకు నేను ఇంతే జీతం తీసుకుంటాను. గతంలో నేను ఫ్రీఛార్జ్ సంస్థను విక్రయించాను. అది నాకిప్పుడు ఉపయోగపడుతోంది’’ అని ఆన్సర్ ఇచ్చారు.
దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనను అభినందిస్తుండగా.. మరికొందరు పన్ను ఆదా చేసుకునేందుకు ఇదో మార్గమంటూ కామెంట్లు చేస్తున్నారు.