Chiranjeevi: కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. నటుడు నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి అనురాగ్ ఠాకూర్తో భేటీ అయ్యారు. ఆయనకు శాలువాకప్పి సన్మానించారు. వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.
అనురాగ్ ఠాకూర్తో భేటీ అయిన సందర్భంలో దిగిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాకూర్ను కలవడం సంతోషంగా ఉందని.. సినీ ఇండస్ట్రీ గురించి నాగార్జునతో కలిసి చర్చించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.