India EXIM Bank : 45 మ్యానెజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి ఇండియా ఎక్జిమ్ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. 15-10-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు 04-11-2022లోగా దరఖాస్తులు చేసుకోవాలి. నవంబర్ లేదా డిజెంబర్ 2022లో ఆన్లైన్ పరీక్ష ఉండనున్నట్లు పరీక్షా నిర్వాహకులు తెలిపారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇండియ ఎక్జిమ్ బ్యాంక్ వెబ్సైట్ను https://www.eximbankindia.in/ విజిట్ చేయండి.
విడుదలైన తాజా నోటిఫికేషన్లో 41 మ్యానెజ్మెంట్ ట్రెయినీ పోస్టులు, 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యానెజర్ పోస్టులు, 2 మ్యానెజర్ లా పోస్టుల్లో వేకెన్సీ ఉంది. సంబంధిత పోస్టులను, రిజర్వేషన్ బట్టి అభ్యర్ధుల కనీస వయసు 21 ఏళ్లు.. గరిష్ట వయసు 40 ఏళ్లుగా నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ 2022లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించి.. జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయనున్నారు.
దరఖాస్తు ప్రారంభం : 15-10-2022
దరఖాస్తు చివరి తేది : 04-11-2022
వెబ్సైట్ : https://www.eximbankindia.in/