Pakistan Video: ఆర్థిక సంక్షోభంతో మరో శ్రీలంకలా తయారయ్యింది దయాది దేశం పాకిస్థాన్. అక్కడ పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. నిత్యావసర ధరలు, ఇంధన ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈక్రమంలో తమకు ప్రధాని మోదీ కావాలంటూ పాకిస్థాన్కు చెందిన ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం పాకిస్థాన్లో తలెత్తిన పరిస్థితులపై ఓ యూట్యాబ్ ఛానెల్తో మాట్లాడుతూ.. తమకు ప్రధాని మోదీ కావాలని.. ఆయన మాత్రమే పాకిస్థాన్ను గట్టెక్కించగలరని అన్నారు. దేశ విభజన జరగకుండా ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తాము కూడా భారత్ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లని తెలిపారు.
పాకిస్థానీలు భారత్తో పోల్చుకోవడం మానుకోవాలని… ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలికలేదన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని.. పాకిస్థాన్ ఆ దేశం దరిదాపుల్లో కూడా లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.