EPAPER

Kanna Lakshminarayana: పసుపు కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: పసుపు కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కాడు. ఇటీవల కాశాయం పార్టీకి రాజీనామా చేసిన కన్నా.. తాజాగా పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.


గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. వందలాది మంది అనుచరులు ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడుతో కన్నా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు అతని అనుచరులు వందలాది మంది పసుపు కండవా కప్పుకున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. విద్యార్థి దశ నుంచి కన్నా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్మమని వెల్లడించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×