Thief Murder : మేడ్చల్ జిల్లా కుషాయిగూడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ప్రవేశించాడు. గర్భగుడిలోని హుండీ వద్దకు వెళ్లాడు. ఆ హుండీని పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ శబ్దానికి ఆలయ వాచ్ మెన్ రంగయ్య మేల్కొన్నాడు. దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగుడు రంగయ్యపై రాళ్లతో దాడికి దిగాడు. ఈ క్రమంలో వాచ్ మెన్ తన వద్ద ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దుండగుడి తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుడి వద్ద దొరికిన ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. దొంగతనానికి వచ్చిన దుండగుడుని గండం రాజుగా గుర్తించారు. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిని పోలీసులు తెలిపారు. ప రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాజు హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.