Archaeology: తవ్వకాల్లో అప్పుడప్పుడు పురాతన కాలం నాటి వస్తువులు బయటపడడం చూస్తుంటాము. వాటిని పరిశీలించి చరిత్రను వెలికితీస్తుంటారు పురవాస్తు శాఖ అధికారులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన వస్తువులు, ఆ కాలం నాటి విశేషాలు బయటపడ్డాయి. అందులో కొన్నింటి గురించి పూర్తి వివరాలను శాస్త్రవేవత్తలు కొనుగొన్నప్పటికీ.. మరికొన్నింటిపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు.
ఇక ఇటీవల ఇరాక్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపగా.. షాకింగ్ విషయం బయటపడింది. పెన్సిల్వేనియా, పిసా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా తవ్వకాలు జరిపి సుమారు 5వేల సంవత్సరాల కిందటి రెస్టారెంట్ను కనుగొన్నారు.
రెస్టారెంట్లో వినియోగించిన వంట సామాగ్రి, గిన్నెలు, బెంచీలతో పాటు ఓ మట్టి ఫ్రిడ్జ్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ ఫ్రిడ్జ్లో బీర్లను దాచిపెట్టినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. అలాగే అప్పట్లో బీర్ తయారు చేసిన ఒక రెసిపీని కూడా కొనుగొన్నారు.