Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్. మోస్ట్ డైనమిక్ లీడర్. హిందూధర్మం కోసం ఎందాకైనా వెళ్లే నాయకుడు. తరచూ వివాదాల్లో నిలిచే నేత. కాంట్రవర్సీ కామెంట్లతో నిత్యం న్యూస్లో ఉండే ఎమ్మెల్యే. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చారు.
ఎప్పటినుంచో ఆయన ఇస్లామిక్ టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఈసారి మరింత టార్గెట్ అయ్యారు. అందుకే ఆయనకు గతంలోనే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఇచ్చింది సర్కారు. కానీ, అది తరుచూ మొండియేస్తుండటం.. ఇటీవల టైర్ ఊడిపోవడం తెలిసిందే.
ఉగ్రవాదులకు టార్గెట్గా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. గతంలోనూ చాలాసార్లు ఇలానే వచ్చింది కానీ, ఈసారి మరింత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా పాకిస్తాన్ నుంచే వచ్చిందా ఫోన్. వాట్సాప్ కాల్లో మనోడికి ధమ్కీ ఇచ్చాడా పాకిస్తానీ.
చంపేస్తామని బెదిరించాడు. తమ స్లీపర్ సెల్స్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయని.. ఖబద్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం తెలుపుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు ఎమ్మెల్యే రాజాసింగ్.