Tarakaratna : నందమూరి తారకరత్న పార్థివదేహన్ని మోకిల నుంచి హైదరాబాద్లోని ఫిల్మ్ఛాంబర్కు తరలించారు. ప్రజలు, అభిమానులు సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడ ఉంచారు. నందమూరి కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉన్నారు. సినీ,రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. బంధువులు, ఆత్మీయులు తారకరత్నను చివరిచూపు చూసి ఆవేదన చెందుతున్నారు. అతనితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కుమారుడి పార్థివదేహం వద్ద తండ్రి మోహనకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అక్కడే కూర్చుని తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, పిల్లలు విలపిస్తున్నారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు వస్తున్న ప్రముఖులు వారిని ఓదారుస్తున్నారు. బాలకృష్ణ, రామకృష్ణ, ఎంపీ విజయసాయిరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ వద్దే ఉన్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉంచతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
జనవరి 27న నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18 రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Taraka Ratna: తారకరత్న టాటూ స్పెషల్ .. ఎవరి కోసమో తెలుసా!
Kantara-2: ‘కాంతార-2’లో సూపర్స్టార్ రజినీకాంత్..