Parasuram:ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ పరశురాం ఓ సినిమా చేస్తాడంటూ వార్తలు వినిపించాయి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందనుకుంటే, అల్లు అరవింద్ మధ్యలో అడ్డం పడటంతో ప్రాజెక్ట్ మేటర్ సైలెంట్ అయ్యింది. అయితే లేటెస్ట్గా పరశురాం సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పరశురాం ఓ కోలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడనేదే విషయం. మీడియాలో వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం పరశురాంతో సినిమా చేయబోతున్న తమిళ హీరో ఎవరో కాదు.. కార్తి. ఈయనకు తెలుగు సినిమా చేయటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు ఊపిరి చిత్రంలో నాగార్జునతో కలిసి కార్తి నటించిన సంగతి తెలిసిందే.
చాలా గ్యాప్ తర్వాత కార్తి మరోసారి స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నారు. అంటే ఈ సినిమా తమిళంలో రూపొందదా? ఎందుకు తమిళంలో రాకుండా ఉంటుంది. కార్తికి తమిళంలో మంచి మార్కెట్టే ఉంది కాబట్టి కార్తి, పరశురాం సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుందనటంలో సందేహమేమీ అక్కర్లేదు. అయితే ఇక్కడొక సందేహం రావచ్చు. మరి విజయ్ దేవరకొండ, దిల్ రాజులతో పరశురాం సినిమా ఆగిపోయిందా అని. కానీ అలాంటి దేమీ లేదట. విజయ్ దేవరకొండతో సినిమాను పూర్తి చేసిన తర్వాతనే కార్తితో సినిమా చేస్తాడట పరశురాం.
ఈ లోపు కార్తి ఇప్పుడు తమిళంలో చేయాల్సిన సినిమాలను పూర్తి చేసుకుంటాడట. మరి కార్తి, పరశురాం సినిమాను ఎవరు నిర్మిస్తారనేది చూడాలి. మరి విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పరశురాం కాంబినేషన్ మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.